వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని మార్పు వార్తలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాజధాని మార్పుపై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు!! || Oneindia Telugu

రాజధాని అమరావతి పై గత వారం రోజులుగా జరుగుతున్న రగడ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికీ రాజధాని అమరావతి విషయంలో ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు. రాజధాని అంశం రణరంగంగా మారుతున్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాజధాని మార్చే ఆలోచన జగన్ కు లేదు అంటూ కొందరు నేతలు, త్వరలో రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మరికొందరు వైసీపీ నేతలు చెప్పడం ఏపీలో గందరగోళానికి గురి చేస్తుంది.

 ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం వద్దనే యోచనలో జగన్ సర్కార్ ... ఇక ఆ స్థానంలో .. ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం వద్దనే యోచనలో జగన్ సర్కార్ ... ఇక ఆ స్థానంలో ..

రాజధానిని దొనకొండకు మార్చే అంశంపై స్పందించిన లక్ష్మీ పార్వతి

రాజధానిని దొనకొండకు మార్చే అంశంపై స్పందించిన లక్ష్మీ పార్వతి

ఇక తాజాగా రాజధాని అమరావతిని మారుస్తారంటూ రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖలో పర్యటించిన లక్ష్మీపార్వతి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
రాజధానిని అమరావతి నుండి దొనకొండ కు మారుస్తున్న ట్లుగా వస్తున్న వార్తలపై స్పందించిన లక్ష్మీపార్వతి జగన్ ఎప్పుడు రాజధానిని మారుస్తున్నట్లు చెప్పలేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక అంతలోనే మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించారు.

రాజధాని వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్న లక్ష్మీ పార్వతి

రాజధాని వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్న లక్ష్మీ పార్వతి


రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, మిగతా ప్రాంతాల అభివృద్ధికి దూరంగా ఉంటాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం అయితే భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఘర్షణలు ఎక్కువవుతాయని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు.
రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెప్పిన లక్ష్మిపార్వతి అన్ని ప్రాంతాల వారు జగన్ కు ఓటు వేశారని ఆ విషయాన్ని గ్రహించి జగన్ తన పాలన సాగిస్తున్నారని చెప్పారు.

రాజధాని మార్పుపై జగన్ ఏం చెప్పలేదు అంటూనే రాజధాని వికేంద్రీకరణ అవసరం అన్న లక్ష్మీ పార్వతి

రాజధాని మార్పుపై జగన్ ఏం చెప్పలేదు అంటూనే రాజధాని వికేంద్రీకరణ అవసరం అన్న లక్ష్మీ పార్వతి

రైతుల దృష్టి మరల్చేందుకే రాజధానినిమార్పు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని లక్ష్మీపార్వతిధ్వజమెత్తారు. ఇక చంద్రబాబు కావాలనే రాజధాని అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చి నానా రచ్చ చేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఇక జగన్ ఇప్పటివరకు రాజధానిని మారుస్తానని చెప్పలేదని, ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని చెప్పిన లక్ష్మిపార్వతి రాజధాని మార్పు పై జగన్ ఏమీ చెప్పలేదు అని చెబుతూనే రాజధాని వికేంద్రీకరణ జరిగితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ తరహా వ్యాఖ్యలే రాజధాని ప్రజల్లోనూ, ప్రతిపక్ష పార్టీలలోనూ గందరగోళానికి కారణమవుతున్నాయి.

English summary
YCP state secretary and NTR's wife Lakshmiparvati made interesting comments in the wake of news of the capital Amaravati change. She commented that jagan never talk about change of capital. Meanwhile, Lakshmi Parvati, who made some interesting comments there is a need for decentralization of capital for any state to develop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X