మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!!
మందుబాబుకు భారీ షాక్. మద్యం.. బీర్ల ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్దమైంది. యుద్దం ప్రభావం మద్యం పైన పడింది. ఇప్పటికే మద్యం తయారీ కంపెనీలు తమ ప్రతిపాదనలతో పెంపు పైన నివేదికలు అందించాయి. ప్రభుత్వం ఈ ప్రతిపాదనల పై తుది నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 12-15 శాతం వరకు పెంచుతూ కొత్త రేట్లు ఖరారు చేస్తున్నారు. పెంపు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. దీంతో.. ఇక, మందు బాబులకు కొత్త ధరలతో ఇక మందు తాగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇరాన్ యుద్ధం ప్రభావం మందుబాబుల జేబులపై పడనుంది. మద్యంతోపాటు బీర్ల ధరలు మే నెలలో పెంచేందుకు రంగం సిద్దం అవుతోంది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా.. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గడువు ఎప్పుడో ముగిసింది. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. అలాగే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40 శాతం పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20శాతం వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని.. వెంటనే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసిన తయారీదారులు మద్యం ధరలను 12- 15శాతం వరకు పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

మద్యం ధరల పై తుది కసరత్తు
కాగా, ఈ అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ఓ రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ధరల పెంపు అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, మద్యం పెంపును అయిదు స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశముంది. బాటిల్ సైజ్ (90 ఎంఎల్/ 180 ఎంఎల్/ 375ఎంఎల్/ 750 ఎంఎల్), బ్రాండ్/ ప్రైస్ రేంజ్ స్లాబ్ (లో కాస్ట్ లిక్కర్, మిడ్ రేంజ్, ప్రీమియం బ్రాండ్స్), ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని ధరల పెంపునకు కసరత్తు జరుగుతోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. వేసవిలో బీర్లకు డిమాండ్ 30శాతం వరకు పెరుగుతున్న తరుణంలో సరఫరా మాత్రం 20శాతం మేర తగ్గడం మార్కెట్లో కొరతకు దారితీస్తోంది.
-
మందు బాబులకు షాక్, ఇక ఈ బ్రాండ్ల ధరలు చూస్తే చుక్కలే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..













Click it and Unblock the Notifications