ఆదివారం రోజున గోదావరి నదిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇప్పటికే రెండు హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. లోతు ఎక్కువగా ఉన్నందున గల్లంతైన వారికోసం వెతికేందుకు సోనార్ స్కానర్లను వినియోగిస్తున్నారు. ఇక అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు తెలంగాణ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజమండ్రికి వెళ్లారు. ఇప్పటికే పలువురు ఏపీ మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.సీఎంతో పాటు రాష్ట్ర హోంమంత్రి సుచరిత కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీసినట్లు సమాచారం.
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు సహాయక చర్యలను స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. వెంటనే బోటు అనుమతులు సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా విపత్తు నిర్వహణల శాఖ ఎప్పటి కప్పుడు ఘటనా స్థలిలో జరుగుతన్న చర్యల గురించి ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు.సహాయక చర్యలు..మునిగిన బోటును వెలికి తీసిన తరువాత ప్రభుత్వం దీని మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే..ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన మీద సీరియస్ గా ఉన్నారు.
Sep 16, 2019, 12:09 pm IST
బోటు మునగడానికి 5 నిమిషాల ముందు అందరూ సంతోషంలో.. అంతలో
12 bodies have been recovered in the the boat accident that occured in Godavari river in East Godavari district of Andhra Pradesh. Rescue operations are on and NDRF staff is conducting a search operation. Meanwhile AP CM is on an aerial survey and he would be visiting the victims in the hospital.