సీన్ రివర్స్: ఎక్సైజ్ అధికారులపై 100 మంది దాడి, రాళ్లతో తెగబడి మరీ, కారు అద్దాలు ధ్వంసం..
గుడుంబా కాయడం నిషేధం. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తోందని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి ఏ మారుమూల ప్రాంతంలోనైనా.. గుడుంబా బట్టి ఉంటే.. ఇక అంతే సంగతులు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తుంటారు. ఇదీ సర్వసాధారణం.. వారికి ప్రభుత్వం హక్కు కల్పించింది. కానీ గుంటూరులో మాత్రం గుడుంబా బట్టిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేస్తే.. సీన్ రివర్సైంది. అక్కడున్న స్థానికులు వందమంది వరకు పోలీసులపై దాడికి తెగబడ్డారు. వినడానికి, చదవడానికి కాస్త వింతగా ఉన్న ఇదీ నిజం.
మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో మంగళవారం స్థానికులు రెచ్చిపోయారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న మాచర్ల ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి సహా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. వంద మంది వరకు పోలీసులపై దాడి చేశారు. 15 మంది రాళ్లతో దాడి చేయడంతో కొండారెడ్డి సహా సిబ్బంది గాయపడ్డారు. వారు వచ్చిన కారును కూడా వదల్లేదు. కారు అద్దాలను ధ్వంసం చేశారు.

గతనెలలో కూడా 7 వేల లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. మరోసారి రావడంతో.. తమను కావాలనే టార్గెట్ చేశారని భావించారు. అధికారులకే బుద్దిచెప్పాలనుకొని మరీ అటాక్ చేశారు. ఎక్సైజ్ అధికారుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సీఐ కొండారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications