సమ్మె ఎఫెక్ట్: మరో 3రోజులకు శ్రీవారి లడ్డూ తయారీ నిలిచిపోనుందా!
గడచిన ఎనిమిది రోజులుగా జరుగుతున్న సరుకు రవాణా లారీల యాజమాన్యాల సమ్మె ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా తీవ్రంగా పడింది. సమ్మె కారణంగా తిరుమలలో నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది.
హైదరాబాద్: గడచిన ఎనిమిది రోజులుగా జరుగుతున్న సరుకు రవాణా లారీల యాజమాన్యాల సమ్మె ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా తీవ్రంగా పడింది. సమ్మె కారణంగా తిరుమలలో నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ వితరణలో భాగమైన అన్న ప్రసాదాల తయారీకి సైతం ఇబ్బందులు తలెత్తాయి.
అయితే, మరో మూడు రోజుల్లో సరుకులు తిరుమల కొండపైకి చేరుకోకుంటే, భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూల తయారీ కష్టమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు మిగతా ప్రసాదాలైన పులిహోర, దద్దోజనం, కట్టెపొంగలి, దోశలు వంటి వాటి తయారీకి అవసరమయ్యే పదార్థాలు సైతం నిండుకున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో నిత్యావసర సరుకులను ఎలాగైనా తిరుమల కొండపైకి తెప్పించేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు సహకరించాలని టీటీడీ స్థానిక లారీ యజమానుల సంఘాన్ని కోరింది.
కాగా, తమ వద్ద మరో వారానికి పైగా సరిపడే నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, అది బియ్యం, పప్పులు మాత్రమేనని, కూరగాయలకు కొరత ఉన్నట్టు తెలుస్తోంది. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అభయమిస్తున్నప్పటికీ, నిండుకున్న నిత్యావసరాలతో అన్న ప్రసాదాల వితరణకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications