భార్య, ప్రియుడు ఇంట్లో ఉండగా ఇంటికి తాళంవేసి నిప్పు, సజీవదహనం
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య, ప్రియుడు కలిసి ఉండగా ఓ భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో వారిద్దరు సజీవదహనం అయ్యారు.
ఈ సంఘటన జిల్లాలోని ముత్తకూరు మండలం కోళ్లమిట్టలో జరిగింది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఇంట్లో ఉండటాన్ని గమనించిన భర్త తన ఇంటికి నిప్పు అంటించాడు.
వారు ఇంట్లో ఉండటాన్ని గుర్తించిన భర్త వెంటనే ఇంటికి బయట తాళం వేశాడు. ఆ తర్వాత నిప్పు అంటించాడు. బయటకు వచ్చేందుకు వారిద్దరికి ఎలాంటి అవకాశం దొరకలేదు. దీంతో వారిద్దరు బయటకు రాక లోపలే చనిపోయారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
English summary
Lover and wife burnt alive by husband in SPS Nellore district on Tuesday.
Story first published: Wednesday, July 4, 2018, 15:17 [IST]