ప్రేమికులను బలితీసుకొన్న అతి వేగం, అచ్చు సినిమా తరహలోనే
అతి వేగం ఇద్దరు ప్రేమికుల ప్రాణాలను బలితీసుకొంది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది. కర్నూల్ -కోడుమూరు రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ప్రేమికులు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
కర్నూల్: అతి వేగం ఇద్దరు ప్రేమికుల ప్రాణాలను బలితీసుకొంది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది. కర్నూల్ -కోడుమూరు రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ప్రేమికులు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
కర్నూల్ లక్ష్మీనగర్ కు చెందిన రాజేష్ మెడికల్ రిప్రజెంటిటివ్ గా పనిచేస్తున్నాడు. టెలికం నగర్ కు చెందిన రేణుక స్తానిక జ్యోతిమాల్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. సోమమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇద్దరూ లంచ్ బ్రేక్ సమయంలో కలిశారు.
వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. ఇద్దరూ కలిసి కోడుమూరు రహదారిలో సల్కాపురం వద్ద వేగంగా వెళ్తూ లారీని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎస్పీ రవికృష్ణ , కర్నూల్ డీఎస్పీ రమణమూర్తి, రూరల్ సీఐ నాగరాజుయాదవ్, ఉల్లిందకొండ ఎస్ ఐ వెంకటేశ్వర్ రావు, నాగలాపురం ఎస్ ఐ మల్లిఖార్జున ఘటనస్థలాన్ని పరిశీలించారు.
ప్రమాదానికి అతి వేగమే కారణమని నిర్ధారించారు.రాజేష్ కు ముగ్గు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి చనిపోయాడు. రేణుక తండ్రి సాయిబాబా, తల్లి ప్రమీల, ముగ్గురు కూతుళ్లలో రేణుక చివరి అమ్మాయి. మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.ఈ ఘటన అచ్చు సినిమాల్లో జరిగిన ఘటనల తరహలోనే ఉంది.