నోట్లకు చెల్లుబాటు గడువు, రూ.2వేల బదులు 200: గల్లా జయదేవ్ కీలక సూచనలు
పెద్ద నోట్ల అంశంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్ లోకసభలో పలు కీలక సూచనలు చేశారు. కరెన్సీ నోట్లకు చెల్లుబాటు గడువు(ఎక్స్పైరీ డేట్) పెట్టాలని, దీనివల్ల అక్రమంగా దాచుకోవడం .
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల అంశంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్ లోకసభలో పలు కీలక సూచనలు చేశారు. కరెన్సీ నోట్లకు చెల్లుబాటు గడువు(ఎక్స్పైరీ డేట్) పెట్టాలని, దీనివల్ల అక్రమంగా దాచుకోవడం తగ్గుతుందని గుంటూరు ఎంపీ జయదేవ్ పేర్కొన్నారు.

గురువారం లోక్సభలో చర్చ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న రూ.2వేల నోటును రద్దుచేసి ఆ స్థానంలో రూ.200 నోటు తీసుకురావాలని కోరారు. మిర్చి రైతుల్ని ఆదుకోవాలని జయదేవ్ లోక్సభలో డిమాండ్ చేశారు.
Speaking in parliament today suggested having expiry dates for big currency notes to avoid hoarding and have... https://t.co/rGwd2Z0TLG
— Jay Galla (@jaygalla) March 30, 2017
గత సంవత్సరం మిర్చి క్వింటాలు రూ.15వేల వరకు ఉండగా ఈ ఏడాది రూ.8వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.12వేల మద్దతుధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని గల్లా జయదేవ్ కోరారు.
More From
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications