మాచర్ల: పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం ఎన్నికల సిబ్బందిపై ఈసీ వేటు
పల్నాడు: మాచర్ల పోలింగ్ కేంద్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా ఆ సమయంలో విధుల్లో పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఘటన సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్లో అడుగు పెట్టిన సమయంలో అక్కడ ఉన్న పీవో, ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేశారని, సంఘటన సమయంలో వారిని వ్యతిరేకించలేదనే అభియోగాలతో సస్పెండ్ చేసింది.
గురువారంలోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం సదరు సిబ్బందిని ఆదేశించింది. ఈ ఘటనపై పాల్వాయిగేటు పోలింగ్ కేంంద్రం పీఓ సరియైన సమాధానం ఇవ్వలేదని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.

ఈవీఎంల ధ్వంసం: ఈసీ సీరియస్
కాగా, పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని వివరించారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు.
ఈవీఎం ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని సీఈవో చెప్పారు. సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారని ఎంకే మీనా పేర్కొన్నారు. మే 20న కోర్టులో రెంటచింతల ఎస్ఐ మెమో దాఖలు చేశారని, ఏ-1 నిందితుడిగా పిన్నెల్లిని ఎస్సై పేర్కొన్నారని తెలిపారు. పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని.. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందన్నారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని సీఈవో వెల్లడించారు.
పిన్నెల్లి అరెస్ట్!
పోలింగ్ రోజు ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఉదయం నుంచి గాలించిన పోలీసులు, ఎట్టకేలకు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి విఫల యత్నం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications