రాజధాని వాసి కిడ్నాప్..., క్రికెట్ బెట్టింగ్ కారణమా....?
గుంటూరు: కిడ్నాపర్ల ద్రుష్టి అమరావతి పై పడింది. యువత పెడద్రోవన నడుస్తున్నారు. లక్షల్లో ఆర్ధిక లావాదేవీల మధ్య చిక్కుకుని లేనిపోని ప్రమాదాలు తెచుకుంటున్నారు. గుంటూరు జిల్లా అమరావతి లో ఆదివారం ఓ కిడ్నాప్ కేసు నమోదు అయింది. స్థానికం గా నివాసం ఉండే ఆనంద్ 30 సంవత్సరాల వ్యక్తి ఆదివారం ఉదయం నవ్యఆంధ్ర రాజధాని అమరావతిలో అదృశ్యం అయ్యాడు.
అయితే ఇతను ఎక్కడ ఉంది ఈ రోజు వరకు ఆచూకీ తెలియ రాలేదు. కట్ చేస్తే గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ఆచూకీ లభించింది. నిన్న ఉదయం అమరావతి కి ఓ కారు లో వచ్చిన వ్యక్తులు నమ్మకంగా ఆనందను బార్ కి తీసుకెళ్లారు. అక్కడ ఫ్యూటుగా మద్యం సేవించి ఆనంద్ ని అమరావతి నుండి ఎక్కడికో తీసుకెళ్లారు. అమరావతి లో మిస్సింగ్ కేసు నమోదు కాగా, పోలీసులకు భయపడిన కిడ్నాపర్ల్ ఆనంద్ ని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా,ముగ్గురు యువకులు ఆనంద్ ని కారులో బంధించి తీసుకెళుతున్న విషయాన్ని పసి గొట్టారు. అప్పటికే పోలీసులకు ఉన్న సమాచారం మేరకు ఆరా తీస్తే కిడ్నాప్ అని తేలింది. కారుని నలుగురు వ్యక్తులను అడుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారణ చేయగా కిడ్నాపర్లు షేకు నాగులు మీరా వలి, మారాసు అశోక్, కుంటా యశ్వంత్ కుమార్ లని తేలింది.
అయితే ఆనంద్ వీరికి లక్షల్లో బకాయి ఉన్నాడని, డబ్బు రాబట్టుకునేందుకు తీసుకెళ్లామని పొలిసు విచారణ లో చెప్పారు. అసలు ఎందుకు ఆనంద్ డబ్బులు ఇవ్వాలి అనే విషయాన్ని పోలీసులు బయటకు చెప్పటం లేదు. యువత ఈ మధ్య క్రికెట్ బెట్టింగ్ లతో లక్షల లక్షల పందేలు కాస్తున్నారని బహుశా అదే కోవకు చెందిన కేసు అయ్యి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇక సత్తెనపల్లి పోలీసులు కేసు అమరావతి కి తరలించగా అమరావతి పోలీసులు దర్యాప్తు పనిలో ఉన్నారు. ముగ్గురు కిడ్నాపర్లను తమ అదుపులో ఉంచారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications