వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు భార్యలు: నగలు అడిగితే ఒకర్ని చంపేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: బంగారు నగలు చేయించాలని అడిగినందుకు ఓ భర్త భార్యను చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. డి. హీరేహాళ్ మండలం లింగంపల్లి గ్రామంలో ఆ కిరాతక భర్త ఆ ఘాతుకానికి ఒడిగట్టాడు.

మల్లెన్నకు ఇద్దరు భార్యలు, మల్లెన్న వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య ఎనిమిదేళ్ల క్రితం విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మల్లెన్న కర్ణాటకలోని కన్నేకుప్పకు చెందిన నాగవేణిని పెళ్లి చేసుకున్నాడు. మల్లెన్న తనకున్న 30 ఎకరాల పొలంలో ఈ మధ్య పత్తి పంట వేశాడు.

 A man Mallenna in Ananthapur district killed his wife Nagaveni

పంటలో దిగుబడి బాగా రావడంతో నాగవేణి బంగారు నగలు చేయించాలని భర్తను అడిగింది. అందుకు మల్లెన్న అంగీకరించలేదు. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ గొడవలో మల్లెన్న ఆగ్రహంతో నాగవేణి నెత్తి మీద బలంగా కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

అయితే, తీవ్ర ఆందోళనకు గురైన మల్లెన్న భార్య మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అతను నిజాలు కక్కాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మల్లెన్నను అరెస్టు చేశారు.

English summary
A man Mallenna in Ananthapur district killed his wife Nagaveni, belongs to Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X