కొడుకులు, కుమార్తెకు మోహన్ బాబు ఆస్తి పంపకాలు
మంచు మోహన్ బాబు తన వారసులకు ఆస్తిని పంచినట్లు తెలుస్తోంది. ఎవరికి రావల్సిన వాటాలను వారికిచ్చేశారని తెలుస్తోంది. ఈ విషయం నిజమేనని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినవారు వ్యాఖ్యానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పనిమీద మోహన్ బాబు షాద్ నగర్ వెళ్లిన సంగతి తెలిసిందే. కార్యాలయం దగ్గర మోహన్ బాబును టీవీ ఛానళ్ల ప్రతినిధులు చుట్టుముడితే వారిమీద ఆయన ఫైరయ్యారు.
బుద్ధి లేదా మీకు.. మీ ఉద్యోగాలు ఊడబీకుతా.. అంటూ వారిమీద నిప్పులు చెరిగారు. ఇలా మీడియా ప్రతినిధులమీద ఫైర్ అవడమనేది మోహన్ బాబు కావాలనే చేశారంటున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేశారంటున్నారు. తన కుమారుడు, కుమార్తెకు ఆస్తిని పంచారని తెలుస్తోంది. గతంలోనే ఆయన తన ఆస్తుల్ని ముగ్గురు పిల్లలకు రాసిచ్చారు. ఫిల్మ్నగర్లో మోహన్ బాబుకి ఓ ఇల్లు ఉంది. అది కుమార్తె మంచు లక్ష్మికి రాసిచ్చారు.

తిరుపతిలో ఉన్న ఆస్తుల్ని విష్ణుకి, హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫ్లాటుని మనోజ్ కి రాసిచ్చారు. అప్పటికీ మోహన్ బాబు పేరుమీద మరికొన్ని ఆస్తులు మిగిలాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేశారు. కొద్దిరోజుల క్రితం విష్ణు, మనోజ్ మధ్య వివాదం రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మనోజ్ మీడియాకు స్వయంగా కొన్ని లీకులందించారు. ఈ విషయాన్ని రియాలిటీ షో అంటూ కప్పి పుచ్చడానికి చూశారుకానీ వీరిద్దరి మధ్య రాజీ కుదర్లేదు. ఆ వివాదాలవల్లే ప్రస్తుతం మోహన్ బాబు తన వారసులకు ఆస్తి పంచి ఫైనల్ సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications