వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాన్సాస్ వివాదం.. ఏడాది నుండి కోడిగుడ్డు మీద ఈకలు పీకారా : సాయిరెడ్డికి వెలగపూడి కౌంటర్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి నాయకుడు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక దొంగ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వల్లనే పంచ గ్రామాల్లో భూ సమస్య వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. దొడ్డిదారిన అశోక్ గజపతి రాజు మళ్లీ సింహాచల దేవస్థానం చైర్మన్ అయ్యారని విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

మాన్సాస్ భూములపై ఎంపీ సాయిరెడ్డి సంచలనం.. దొంగ జీవోలు తెచ్చి భూములు అమ్మారుమాన్సాస్ భూములపై ఎంపీ సాయిరెడ్డి సంచలనం.. దొంగ జీవోలు తెచ్చి భూములు అమ్మారు

విజయసాయి రెడ్డిపై మండిపడిన వెలగపూడి రామకృష్ణబాబు

విజయసాయి రెడ్డిపై మండిపడిన వెలగపూడి రామకృష్ణబాబు

మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచైత నియామకం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీనిపై డివిజన్ బెంచ్ కి అప్పీల్ కి వెళ్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. అశోక్ గజపతిరాజును దొంగని వ్యాఖ్యానించడంపై విరుచుకుపడిన వెలగపూడి రామకృష్ణబాబు16 నెలలు జైల్లో ఉండి వచ్చిన నీవెక్కడ? పుట్టుకతోనే రాజవంశీయుడు అయిన అశోక్ గజపతిరాజు ఎక్కడ అంటూ ఫైర్ అయ్యారు.

ఏడాదిగా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా ?

ఏడాదిగా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా ?


మాన్సాస్ లో అక్రమాలు జరిగాయని విజయసాయి అంటున్నాడని పేర్కొన్న వెలగపూడి నువ్వు నియమించిన తొత్తే కదా మాన్సాస్ చైర్ పర్సన్ గా ఏడాది కాలంగా ఉంది అంటూ మండిపడ్డారు. సంచయిత చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో అక్రమాలు నీకు కనబడలేదా అంటూ ప్రశ్నించిన వెలగపూడి రామకృష్ణబాబు ఏడాదిగా కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Recommended Video

IAS Srilakshmi కి రూట్ క్లియర్.. అన్నీ అనుకూలిస్తే AP CS, Ys Jagan స్పెషల్ ఫోకస్ || Oneindia Telugu
అశోక్ గజపతిరాజుపై విజయసాయి తీవ్ర ఆరోపణలు

అశోక్ గజపతిరాజుపై విజయసాయి తీవ్ర ఆరోపణలు


ఇక మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారని పేర్కొన్నారు. 2010లోనే 500 ఎకరాలకు పైగా కాజేశారని , వీటన్నిటి పైన విచారణ జరిపిస్తామని తెలిపారు. సింహాచల ఆలయ భూములకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న పంచ గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధాన పాదయాత్ర సమయంలో మాట ఇచ్చారని ఆ మాటకు కట్టుబడి పని చేస్తామని వెల్లడించారు.

English summary
Vijayasai allegations on ashok gajapathiraju says that irregularities had taken place in Mansas.Velagapudi Ramakrishnababu, who was outraged on Vijayasai reddy over the comments on Ashok Gajapathiraju for calling him a thief. Velagapudi incensed that vijayasai has been in jail for 16 months. Ashok Gajapatiraju, is a king by birth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X