వివాహితపై నాటు వైద్యుడి అత్యాచారం: మహిళను కట్టేశారు
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం మోర్సపూడిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వివాహితను పసరువైద్యం చేస్తానంటూ నమ్మించిన గోవింద్ అనే నాటు వైద్యుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు నాటువైద్యుడికి దేహశుద్ధి చేశారు. నాటువైద్యుడి వెంట వచ్చిన మహిళను గ్రామస్థులు కట్టేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హత్య కేసులో అరెస్టు
హత్యానేరంతో పాటు పలు దోపిడీ కేసుల్లో నిందితుడు మామిడి తిరుపతిరావును విశాఖపట్నం మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పలు వాహనాలను, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
చిత్తూరు జిల్లా పూతలపట్టులో బడా ఎర్రచందనం స్మగ్లర్ కుమార్ను పూతలపట్టు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం తరలింపు వ్యవహారంలో ఈయనపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications