వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోలార్ దాడి: గాయపడ్డ పాలమూరు వైద్య విద్యార్థి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kameshwar Sai Prasad
బెంగళూరు/మహబూబ్‌నగర్: వారం రోజుల క్రితం దుండగుల దాడిలో గాయపడిన కోలార్ వైద్య కళాశాల విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మృతి చెందాడు. కర్నాటక రాష్ట్రంలోని కోలార్ వైద్య విశ్వవిద్యాలయంలో కామేష్ చదువుతున్నాడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థి.

అతని పైన గత వారం కొందరు దుండగులు పెట్రోలు పోసీ నిప్పు అంటించారు. తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సాయి ప్రసాద్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కామేష్‌కు శరీరం డెబ్బై శాతం కాలిపోయింది. దీంతో అతనిని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చర్పించారు.

గాయాలు తీవ్రం కావడంతో మూత్రపిండాలు పని చేయకపోవడంతో వైద్యులు కామేష్‌కు డయాలసిస్ నిర్వహించారు. కృత్రిమ శ్వాస కొనసాగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

కామేష్ ఈ నెల 12వ తేదీన రాత్రి పదిన్నర గంటలకు వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతని మెడలో గొలుసులు లాగేందుకు ప్రయత్నంచారు. ప్రతిఘటించడంతో పెట్రోలు పోసి నిప్పు అంటించి పరారయ్యారు.

కామేష్ తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మలు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు.

English summary
The final year MBBS student Kameshwar Sai Prasad, who sustained burns dead on Tuesday in St.John's Hospital, Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X