ఏపీలో భూ ప్రకంపనలు: భయంతో పరుగులు తీసిన జనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు రెండు సెకన్లకుపైగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు రెండు సెకన్లకుపైగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇళ్లు, కార్యాలయాలు నుంచి బయటకు పరుగులు తీశారు. అంతా రోడ్లపైకి వచ్చి భయం భయంగా గడిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. గుంటూరుజిల్లాలోని వినుకొండ, శావల్యపురం, కారుమంచి, మతుకుమల్లి, కృష్ణాపురం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలతో శబ్దాలు వచ్చాయి.

భూకంపన తీవ్రతకు ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన జనం రోడ్లు, ఖాళీ ప్రదేశల్లోకి పరుగులు తీశారు. ఆ తర్వాత భూ ప్రంకపనలు తగ్గినప్పటికీ మరోసారి ఏమైనా ప్రకంపనలు చోటు చేసుకుంటాయోనని భయపడుతున్నారు.
అయితే, ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ ప్రకంపనలపై ప్రభుత్వ, వాతావరణ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications