మంత్రి నారాయణ తనయుడు 2 ని.ల్లో ఇంటికి చేరుకుంటాడనగా...!
ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ, స్నేహితుడు రాజా రవివర్మ మృతి అందరినీ కలచివేస్తోంది. నిషిత్ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్గా కూడా ఉన్నారు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాననేలోగా ప్రమాదం
హైదరాబాద్/అమరావతి: ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ, స్నేహితుడు రాజా రవివర్మ మృతి అందరినీ కలచివేస్తోంది. నిషిత్ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్గా కూడా ఉన్నారు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాననేలోగా ప్రమాదం జరిగింది.
దాదాపు రాత్రి పదకొండు గంటల వరకూ హైదరాబాద్ నారాయణ మెయిన్ బ్రాంచ్లో సిబ్బందితో సమావేశమై విద్యార్థుల అడ్మిషన్స్ తదితర విషయాల గురించి నిషిత్ చర్చించాడని తెలుస్తోంది.

స్నేహితుల నుంచి ఫోన్ వస్తే..
అనంతరం నిశిత్ ఇంటికి బయలు దేరే ముందు స్నేహితుల నుంచి ఫోన్ వచ్చిందని, వారి కోరిక మేరకు స్నేహితులను కలిసి వారితో డిన్నర్ చేసి ఇంటికి బయలు దేరారని తెలుస్తోంది.

2 నిమిషాల్లో ఇంటికి చేరేవాడే..
మరో రెండు నిమిషాలైతే ఇంటికి చేరి ఉండేవారేనని, కానీ అంతలోనే మృత్యువు తొమ్మిదో నెంబర్ పిల్లర్ రూపంలో బలి తీసుకుంది. అసలు రోడ్ నంబర్ 36 చాలా ప్రమాదకరమైన మూల మలుపు అని, అందులోనూ పిల్లర్ నెంబర్ తొమ్మిది అత్యంత ప్రమాదకరమైనదని స్థానికులు అంటున్నారు.

ప్రత్యక్ష సాక్షి..
కాగా, ప్రమాదం అతి వేగం వల్లే జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి కొన్ని వివరాలను వెల్లడించాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

భారీ శబ్దం... భయపడి నిద్రలేచిన గార్డ్
ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో తాను నిద్రపోతున్నానని, పిల్లర్ను కారు ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని చెప్పాడు. ఆ శబ్దానికి తాను భయపడి లేచానని తెలిపాడు. అర్ధరాత్రి దాటాక ఇది జరిగిందన్నాడు.

కారు వేగానికి పిల్లర్ విరిగింది..
ఆ తర్వాత ఏమైందోనని వెళ్లి చూశానని, కారు ఢీకొట్టిన వేగానికి పిల్లర్ విరిగి కాంక్రీట్ బయటికొచ్చిందని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఆ సమయంలో ఆకాశం మొత్తం మేఘావృతమై, చినుకులు రాలుతున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు స్పాట్కు వచ్చారని చెప్పారు.

నేతల పరామర్శ, సంతాపం
కాగా, నిషిత్ మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ సంతాపం తెలిపారు. పవన్ కళ్యాణ్, హరీష్ రావు వంటి నేతలు ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని నెల్లూరుకు తరలిస్తారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications