ఆ విషయం గుర్తుంచుకోకపోతే.. జనం చంద్రబాబు తాట తీస్తారు: రోజా
చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమాన్ని గాలికొదిలేస్తే జనాలు తాట తీస్తారన్న సంగతి చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. మహిళా రక్షణ విషయంలో టీడీపీ ప్రభుత్వ తీరును ఆమె తప్పుబట్టారు. తన చుట్టూ ఉన్న తోడేళ్లను కాపాడుకోవడానికి.. చంద్రబాబు ఆడవాళ్ల మానప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. నేడు విజయనగరంలో పర్యటించిన సందర్బంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా సంక్షేమాన్ని గాలికొదిలేస్తే జనాలు తాట తీస్తారన్న సంగతి చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.
ఒక దళిత మంత్రితో కాళ్లు పట్టించుకున్న చంద్రబాబు మహిళలకు ఏం న్యాయం చేస్తారని రోజా ప్రశ్నించారు. పేరుకే కేబినెట్ లో మహిళా మంత్రులు తప్ప.. వారికి ఎలాంటి అధికారాలు లేవని దుయ్యబట్టారు. సోమవారం నాడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్బంగా డ్వాక్రా మహిళలకు, మహాలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేయాల్సిందిగా రోజా డిమాండ్ చేశారు.