రూ.5,700 కోట్లతో మోదీ కొత్త కేబినెట్లో టీడీపీ ఎంపీ నయా రికార్డ్
Pemmasani Chandra Sekhar: డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఏపీకి చెందిన ప్రవాసాంధ్రుడు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి చెందిన లోక్సభ సభ్యుడు. మొన్నటి ఎన్నికల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన అభ్యర్థి. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే తిరుగులేని మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు.
గుంటూరు లోక్సభ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈ ఎన్నారై.. సుమారు 3.50 లక్షల ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కిలారి వెంకట రోశయ్యపై విజయం సాధించారు. తెలుగుదేశం కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి గెలిచింది.

పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర కేబినెట్లోనూ చోటు దక్కించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి రెండు బెర్త్లను కేటాయించింది బీజేపీ. పెమ్మసానితో పాటు, శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుకూ చోటు లభించింది. ఈ మేరకు వారిద్దరూ కూడా ఢిల్లీలో నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటైన సమావేశానికి హాజరయ్యారు.
కాగా- మోదీ కొత్త కేబినెట్లో అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించనున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఆస్తుల విలువ 5,700 కోట్ల రూపాయలు. ఈ మేరకు తన ఎన్నికల డిక్లరేషన్లో వాటిని పొందుపరిచిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్ మంత్రులందరిలోకెల్లా ఆయనే రిచ్చెస్ట్ కానున్నారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.
వృత్తిరీత్యా ఆయన డాక్టర్. 1993-94 ఎంసెట్ పరీక్షల్లో మెడిసిన్లో 27వ ర్యాంక్ సాధించారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. పెన్సిల్వేనియాలో గల గీసింగర్ మెడికల్ సెంటర్లో ఎండీ చేశారు. తాజాగా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications