ఆదుకోండి: ప్రభుత్వాలకు మోహన్ బాబు, నేను ఉచితంగా చదివిస్తా
హైదరాబాద్: కరువుతో అల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలని సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు గురువారం విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అవయవదానం చేసే కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అవయవదానం చేసిన కుటుంబంలోని పిల్లలకు ఐదో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు ఉచిత విద్యను అందజేస్తానని మోహన్ బాబు చెప్పారు.

2029 నాటికి దేశంలో నెంబర్ వన్గా: చంద్రబాబు
2029 నాటికి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే ఆ లక్ష్యాన్ని 2020 నాటికే సాధించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మాట్లాడారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఓ సునామీ సృష్టించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉండటం మనకు కలసి వచ్చే అంశమన్నారు.
గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసి, రాష్ట్రంలో కరవుకాటకాలు లేకుండా చేస్తామని చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రాక్టికల్గా ముందుకు వెళ్లేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications