కెసిఆర్ వల్లే తెలంగాణపై కేంద్రం జాప్యం: మోత్కుపల్లి
పిల్ల కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు), తెరాసలను బలోపేతం చేసేందుకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు, తెరాస నాటకాలు ఆడుతున్నాయని ఆయన అన్నారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో తమ పార్టీని దెబ్బ తీయలేవని ఆయన అన్నారు.
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ అఖిల పక్ష సమావేశం ఎందుకు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. విభజన చేసి సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఓట్లు, సీట్ల కోసం తాము తెలంగాణ అంశాన్ని వాడుకోవడానికి చూడడం లేదని ఆయన అన్నారు.