కొలికపూడి Vs చిన్ని వివాదంలో కొత్త మలుపు, ఇక ఫైనల్..!!
టీడీపీలో తిరువూరు పంచాయితీ కొత్త మలుపు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు ఇద్దరు నేతలు హాజరయ్యారు. ఎవరి వాదన వారు వినిపించారు. తన నియోజకవర్గంలో ఎంపీకి పని ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎంపీ పైన చేసిన ఆరోపణల పైనా ఆధారాలు సమర్పించారు. అటు ఎంపీ తాను చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. కమిటీ ఈ వివాదం పైన నివేదిక సమర్పించనుంది. కొలికపూడి ఇచ్చిన ఆధారాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కొలికపూడి.. ఎంపీ చిన్నికి క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది. ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ తమ వాదనలను వినిపించారు. తమ వైఖరులను పునరుద్ఘాటించారు. కొలికపూడి ఈ సమయంలోనూ ఎంపీ తీరు పైన ఫిర్యాదు చేసారు. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని? ఆయన తన నియోజక వర్గంలో అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని... వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేదని చెబుతున్నా రని చెప్పినట్లు సమాచారం. ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుంటే తానూ మాట్లాడనని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, పార్టీకి నష్టం కలిగించేలా తాను గీతదాటి వ్యవహరించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టంచేశారు.

ఈ ఇద్దరి వివాదం పైన చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. క్రమశిక్షణా కమిటీ ఇద్దరితో మాట్లాడి నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో.. ముందుగా కొలికపూడి వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనూరాధ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. నాలుగు గంటలపాటు తన వాదనలు వినిపించారు. నివేదిక రూపంలో కమిటీకి అందజేశారు.
చిన్నిపై తాను చేసిన ఆరోపణ లకు సంబంధించిన ఆధారాలను క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచానని తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు, వివరణ ఇచ్చానన్నారు. వివాదంపై పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. చిన్ని సైతం తన వాదన వినిపించారు. వ్యక్తిగత ఎజెండాలతో పార్టీని నాశనం చేయాలనుకునే వారి విషయంలో నేను కఠినంగా ఉండాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక పైన చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications