ఇది బీజేపీ కుట్ర.. దమ్ముంటే అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలి: ఎంపీ రామ్మోహనాయుడు
న్యూఢిల్లీ: తెలుగు వారి ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, టీడీపీపై విమర్శలు చేస్తున్న వారి వెనుక బీజేపీ హస్తం ఉందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అసలు మిత్ర దర్మమంటే అంటే ఏంటో బీజేపీకి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.
రాజకీయ కారణాలతోనే రైల్వే జోన్ పై బీజేపీ లేనిపోని డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు అమిత్ షా రాసిన లేఖను చూస్తుంటే.. అది తెలుగువాళ్లను అవహేళన చేయడానికే అన్న విషయం అర్థమవుతుందన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమతో కలిసిరాకపోవడం, ఐక్యత లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 'అవిశ్వాసం'పై కూడా బీజేపీ రాజకీయాలు చేస్తోందని, బీజేపీకి ఏ భయం లేకుంటే.. నిజంగా దమ్ముంటే అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలని రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications