Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముద్రగడ దీక్ష.. ఫలించిందా? చక్రం తిప్పిన బాబు: చిరుపై ఎత్తుగడ, జగన్ కుదేలు

విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం నిరాహార దీక్షను విరమించారు. కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆయన నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వెనుక వైసిపి అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని అధికార టిడిపి విమర్శలు చేసింది.

అయితే, ఆయన దీక్షకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. శుక్రవారం ఉదయం ఆయన దీక్షను ప్రారంభించారు. ఆ రోజు నుంచి కాపులు యావత్తు ఆయనకు అండగా నిలబడ్డారు. కాపుల నుంచి ఆయనకు లభిస్తున్న మద్దతు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలుమార్లు అధికారికంగా, అనధికారికంగా ముద్రగడతో చర్చలు జరిపింది. ప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించి సోమవారం నాటికి ముద్రగడ దీక్షను విరమించింది. ముద్రగడ దీక్షను విరమింప చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం సఫలమైందని చెప్పవచ్చు.

ముద్రగడ దీక్ష నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపులను బీసీలలో చేర్చేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ గడువు మూడు నెలలు కావాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చల సమయంలో ఆయన 7 నెలల ఇరవై రోజులకు అంగీకరించారు.

తద్వారా ఈ విషయంలో ప్రభుత్వానిదే పైచేయి అని చెప్పవచ్చు. కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిషన్‌కు 9 నెలల సమయం ఇచ్చారు. అది వేసి ఇప్పటికే నెల మీద పది రోజులు కావొస్తుంది. ఇప్పటికే నెల పది రోజులు అయినందున ప్రభుత్వం చెప్పిన గడువుకే ముద్రగడ అంగీకరించారు.

Mudragada deeksha: Chandrababu wins on opposition

మంజునాథ కమిషన్‌కు నిర్దిష్ట కాలపరిమితిని ముద్రగడ ప్రభుత్వానికి చెప్పారు. దానికి ఏడు నెలలకు పైగా సమయం ప్రభుత్వం తీసుకుంటుంది. కాపు కార్పోరేషన్‌కు వచ్చిన దరఖాస్తులకు రుణాలు ఇచ్చేలా హామీ, కాపు కమిషన్లో ముద్రగడ సూచించిన వారికి ఒకరికి స్థానం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాల్లో ముద్రగడ విజయం సాధించారు.

ఇదిలా ఉండగా, ప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించిందని చెప్పవచ్చు. సోమవారం చిరంజీవి, దాసరి నారాయణ రావు, రఘువీరా రెడ్డి తదితరులు ముద్రగడ ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిని ఎక్కడికి అక్కడ అడ్డుకొని, టిడిపి నేతలు నేరుగా ముద్రగడవద్దకు వెళ్లి చర్చలు సఫలమయ్యేలా చేశారు.

ప్రతిపక్ష నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి ఉంటే చర్చలకు ఆటంకం కలిగే పరిస్థితి ఉండేది. అయితే, వారిని అడ్డుకొని, ముద్రగడతో చర్చలు జరపడం, టిడిపి నేతలు ముద్రగడతో చర్చలు జరుపుతూనే.. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు. తద్వారా ప్రతిపక్షాలకు చెక్ చెప్పారని భావించవచ్చు. ఇది జగన్‌కు షాకేనని అనవచ్చు.

మరోవైపు, ప్రభుత్వం మరోసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాటను విన్నదని చెప్పవచ్చు. అయితే, చర్చలకు ప్రభుత్వం ముందు నుంచే ప్లాన్ చేస్తున్నప్పటికీ.. నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ప్రభుత్వానికి సూచన చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+