కొత్త పార్టీ ప్రతిపాదన, ముద్రగడ వ్యూహాత్మక మౌనం?
కాకినాడ: మాజీ ఎంపీ హర్ష కుమార్, కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంలు కలిశారు. వీరిద్దరి మధ్య ఆదివారం చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వీరి మధ్య కొత్త పార్టీ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాపులు, దళితులు కలిసి కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందని చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
రెండు బలమైన వర్గాలు కలిస్తే రాజకీయాలను శాసించవచ్చునని వారు భావిస్తున్నారని అంటున్నారు. అయితే, హర్ష కుమార్ ఈ ప్రతిపాదన తేగా ముద్రగడ మౌనం వహించారని తెలుస్తోంది. కొత్త పార్టీ ప్రతిపాదన హర్ష కుమార్ వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని ముద్రగడ చెప్పారు.

హర్షకుమార్తో ముద్రగడ సమావేశం కావడం ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. హర్షకుమార్ ఇంటికి వెళ్లి ముద్రగడ ఆయనతో సమాశం అయ్యారు. కొత్త పార్టీ అంశం గురించి హర్షకుమార్ను మీడియా ప్రశ్నించగా... ప్రజలు కోరకుంటే ఏమైనా జరగొచ్చన్నారు.
అదే సమయంలో ముద్రగడ పెదవి విప్పకపోవడం గమనార్హం. కేవలం మర్యాదపూర్వకంగానే హర్షకుమార్తో భేటీ అయ్యానని తెలిపారు. అయితే, వీరి సమావేశం, హర్షకుమార్ మాటలు.. నేపథ్యంలో కొత్త పార్టీ ఊహాగానాలను బలపరుస్తున్నాయి.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications