Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రసంగం.. ఎవరూ ఊహించని టాపిక్‌పై గళం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శాసనసభ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభను బహిష్కరించినా, శాసనమండలిలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో, శాసనమండలి చర్చలు కీలక అంశాలుగా మారుతున్నాయి. తాజాగా, జనసేన పార్టీ తరపున మండలిలోకి అడుగుపెట్టిన మెగా బ్రదర్, నటుడు నాగబాబు ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్సీగా నాగబాబు ప్రస్థానం
నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గానూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. చట్టసభల్లో సభ్యుడుగా లేని కారణంగా, ముందుగా ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. త్వరలో ఆయనకు మంత్రి పదవి లభించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగబాబు ఎన్నికతో శాసనమండలిలో జనసేన బలం పెరిగింది.

Nagababu s Maiden Speech in Legislative Council Focus on Pending Cases

శాసనమండలిలో తొలి ప్రసంగం
మొదటిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టిన నాగబాబు, మొదట్లో కొంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఈరోజు ఆయన చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. కూటమి ,వైఎస్సార్‌సీపీ సభ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న తర్వాత, ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు కేసుల గురించి ఆయన గణాంకాలతో సహా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+