మోడీని కలవనున్ననాగార్జున: అమల పొలిటికల్ ఎంట్రీ?
హైదరాబాద్/అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా మన రాష్ట్రంలోను కనిపిస్తోంది. ఇప్పటికే మోడీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇప్పుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున భేటీ కానున్నారు.
మోడీతో భేటీ కోసం ఆయన అహ్మదాబాద్ బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఆయన మోడీతో భేటీ అయ్యే అవకాశముంది. గత ఏడాది ఆగస్టులో మోడీ హైదరాబాదుకు వచ్చినప్పుడు సినీ, పారిశ్రామిక ముఖ్యులు ఆయన వద్దకు క్యూ కట్టారు.

ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు మోడీ పట్ల ఆకర్షితులవుతున్నారు. మొన్న శుక్రవారం పవన్, నేడు నాగార్జున మోడీతో కలుస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి నాగార్జున మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
అమల కోసమేనా?
బిజెపి, మోడీ వైపు ఆకర్షితులైన నాగార్జున తన సతీమణి అమల కోసం కూడా అహ్మదాబాద్ బయలుదేరి ఉంటారంటున్నారు. ఈ ఎన్నికల్లో అమల రాజకీయ ఆరంగేట్రం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆమె విజయవాడ లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారంటున్నారు. మోడీకి మద్దతు పలికి అదే సమయంలో తన సతీమణి అమలకు విజయవాడ స్థానం ఖరారు చేయించుకనే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications