జగన్తో నందమూరి కుటుంబ సభ్యులు భేటీ.. ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు మహనీయుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం నందమూరి కుటుంబం, ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజాభిష్టం ఈ నాటికి నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులు ఎంతగానో సంబరపడుతున్నారు. విశ్వసనీయతకు, విలువలకు సీఎం జగన్ మారుపేరంటూ కొనియాడుతున్నారు.
జగన్తో నందమూరి కుటుంబం
.
మహనీయుడు
నందమూరి
తారక
రామారావు
స్వగ్రామం
నిమ్మకూరుకు
చెందిన
ఎన్టీఆర్
బంధువులు,
మిత్రులు
ఏపీ
ముఖ్యమంత్రి
జగన్
మోహన్
రెడ్డిని
ఆయన
క్యాంప్
కార్యాలయంలో
కలిశారు.
విజయవాడ
జిల్లాలకు
ఎన్టీఆర్
పేరు
పెట్టినందుకు
సీఎం
జగన్కు
కృతజ్ఞతలు
తెలిపారు.
ప్రతిపక్షంలో
ఉన్నప్పుడు
పాదయాత్ర
సందర్భంగా
తమ
జిల్లాలకు
ఎన్టీఆర్
పేరు
పెట్టాలని
నిమ్మకూరు
గ్రామస్తులు
కోరారు.
అధికారంలోకి
వస్తే
కృష్ణా
జిల్లాకు
నందమూరి
తారక
రామారావు
పేరు
పెడతామంటూ
పాదయాత్రలో
జగన్
హామీ
ఇచ్చారు.
నిమ్మకూరు సమస్యలు సీఎం దృష్టి
నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునందుకు సీఎం జగన్ను నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, నిమ్మకూరు గ్రామస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిమ్మకూరు గ్రామంలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో కోటి రూపాయల విలువైన పైపులైను దెబ్బతిన్నాయని.. మంచినీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. వాటికి నిధులు కేటాయించాలని కోరారు. దీంతో వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిమ్మకూరులో ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఖర్చుకు వెనుకాడకుండా వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.
.ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
నిమ్మకూరు
గ్రామంలో
ఉన్న
14
ఎకరాల
చెరువులో
ఎన్టీఆర్
విగ్రహాం
ఏర్పాటు
చేయాలని
నందమూరి
కుటుంబ
సభ్యులు,
మిత్రులు,
గ్రామస్తులు
సీఎం
జగన్ను
కోరారు.
దీనికి
ముఖ్యమంత్రి
సానుకూలంగా
స్పందించారరు.
ఎన్టీఆర్
100వ
పుట్టిన
రోజు
నాటికి
ఎన్టీఆర్
కాంస్య
విగ్రహాన్ని
ఏర్పాటు
చేస్తామని
నిమ్మకూరు
వాసులకు
హామీ
ఇచ్చారు..
వచ్చే
నెల
28న
శంకుస్థాపన
చేసిన
వీలైనంత
త్వరగా
పూర్తి
చేసి
ప్రారంభోత్సం
చేస్తామని
తెలిపారు.
ఈ
మేరకు
విగ్రహం
ఏర్పాటుపై
పరిశీలించాలని
అధికారులకు
జగన్
ఆదేశించారు
.