నందమూరి సుహాసిని కుమారుడి వివాహం: చంద్రబాబు, బాలయ్య హాజరు
హైదరాబాద్: దివంగత సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడైన వెంకట శ్రీహర్ష వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ప్రముఖ సినీటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తోపాటు ఆయన కుటుంబసభ్యులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

కాగా, సుహాసిని కుమారుడు వెంకట శ్రీహర్ష ఎంగేజ్మెంట్ ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఈ వేడుకకు ఆమె సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్, మరో సోదరుడు, దివంగత జానకిరామ్ భార్య, కుమారుడు, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. బిజీ షెడ్యూల్ కారణంగా మరో సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.
ఇది ఇలావుండగా, రెండ్రోజుల క్రితం ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఆయన నగరానికి చెందిన డాక్టర్ ఐశ్వర్యను వివాహమాడారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్-ఉపాసన దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు హాజరయ్యారు. సిద్ధార్థ్ నిశ్చితార్థం మే నెలలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications