లోకేష్ చేతికి విరాళాలు, ఎన్టీఆర్కు నివాళి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కార్యకర్తల సమన్వయకర్తగా ఇలా పదవీ బాధ్యతలు చేపట్టారో లేదో అప్పుడే కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు పచ్చిపడుతున్నాయి.
టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.2.85 లక్షల విరాళాలు లోకేష్ చేతికి అందాయి. గురువారంనాడు పార్టీ కార్యకర్తల సమన్వయకర్తంగా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో లోకేష్కు అభిమానులు, కార్యకర్తలు, దాతలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువాలు కప్పి అభినందించారు.
నోవా ఇనిస్టిట్యూషన్స్ అధినేత ఎం. కృష్ణారావు లక్ష రూపాయలు, పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఉప్పలపాటి చక్రపాణి లక్ష రూపాయలు, అమెరికాకు చెందిన ఎన్నారై టి. రేష్మి వేయి డాలర్లు, కె. శివన్నారాయణ రూ. 25 వేల విరాళాలను చెక్కుల రూపంలో లోకేష్కు అందించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్కు నారా లోకేష్ నివాళి
టిడిపి కార్యకర్తల సమన్వయకర్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్కు ఇలా వచ్చారు.
ఎన్టీఆర్కు నివాళి
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా లోకేష్ స్వర్గీయ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. ఆయన వెంట అనుచరులు కూడా ఉన్నారు.
నారా లోకేష్ మీడియాతో..
ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో కూడా మాట్లాడారు. ఆయన పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించే అవకాశాలున్నాయి.
విరాళాల సేకరణ
కార్యకర్తల సంక్షేమ నిధికి నారా లోకేష్కు ఎన్నారై మహిళ టి. రేష్మి వేయి డాలర్లు విరాళంగా అందజేశారు.
కృష్ణారావు లక్ష రూపాయలు
నోవా ఇనిస్టిట్యూషన్స్ అధినేత ఎం కృష్ణారావు లక్ష రూపాయల చెక్కును నారా లోకేష్కు అందించారు.
శివనారాయణ రూ. 25 వేలు
టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధికి శివనారాయణ 25 వేల రూపాయలను చెక్కు రూపంలో నారా లోకేష్కు అందించారు.
ఉప్పలపాటి లక్ష రూపాయలు
టిడిపి సమన్వయకర్తల సంక్షేమ నిధికి ఉప్పలపాటి చక్రపాణి లక్ష రూపాయల చెక్కును నారా లోకేష్కు అందించారు.