కేంద్రంపై బాధ్యత ఉంది, విభజించి నిధులివ్వమంటే ఎలా: బీజేపీపై నారా లోకేష్
అమరావతి: విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మంత్రి నారా లోకేష్ సోమవారం అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాడుతామన్నారు. రాష్ట్రాన్ని విభజించి నిధులు ఇవ్వలేమని చెబితే ఎలా అన్నారు.
ప్రత్యేక హోదాతో పాటు మిగతా అంశాలు కీలకమే అని చెప్పారు. వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదన్నారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. సీమలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు.

Recommended Video

Chandrababu Naidu Ready To Accept Package From Centre
రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా విభజించారన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications