పెట్టుబడుల వేట: లోకేష్కు ఎన్నారైల స్వాగతం
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టిన తెలుగుదేశం పారట్ీ యువ నేత నారాలోకేష్కు కోమటి జయరాం నేతృత్వంలోని టీడీపీ ఎన్నారై విభాగం ఘనస్వాగతం పలికింది. శాంట్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించింది.
కోమటి జయరాం నేతృత్వంలో మే 8వ తేదీన స్మార్ట్ విలేజర్ కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న లోకేష్ తెలుగు రాష్ర్టాల్లోని గ్రామాలను దత్తత తీసుకునేలా పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు.
ఆంధ్రా కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లోకేష్తో సమావేశం కానున్నారు. మరోవైపు లోకేష్తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఔత్సాహిక వ్యాపార వేత్తలు ఉత్సాహం చూపించారు.
ఈ నెల 12వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడానికి ఆయన అమెరికాలో కృషి చేస్తారు. ఈ నెల 7వ తేదీన ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా కలిసే అవకాశం ఉంది.