పోలీసుల అదుపులో నవ్యాంధ్ర న్యూస్ చానెల్ ఎండి
నెల్లూరు: నవ్యాంధ్ర న్యూస్ చానల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ను నెల్లూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు దొంగతనాల కేసులు నమోదు కావడంతో రెండురోజుల క్రితం ఒంగోలులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. గుంటూరు కేంద్రంగా నవ్యాంధ్ర టీవీ చానల్ను ఆయన ప్రారంభించారు.
ఆ చానెల్లో విలేకరులుగా అవకాశం కావాలంటే సంస్థకు రూ.2 లక్షలు చెల్లించాలని షరతులు విధించేవారు. 13 జిల్లాలతో పాటు గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో అదనపు విలేకర్లను నియమించుకుని లక్షలు వసూలు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

ఆరు నెలల క్రితం నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రూ.2 లక్షలు, మంగళసూత్రం, సజ్జాపురంలోని మరో ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం అపహరించుకుపోయినట్లు రూరల్ పోలీసుస్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ ఘటనకు ముందు భక్తవత్సలనగర్ ప్రాంతంలోని కృష్ణమందిరంలో ఆరు మంగళసూత్రాలతో పాటు కొంత నగదు, బంగారం తీసుకెళ్లినట్లు పోలీసుల రికార్డులో ఉంది.
రామ్మూర్తినగర్ ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పని చేస్తూ నగదు అపహరించుకుపోగా దాని నిర్వాహకులు ఇప్పటికీ ఇతని కోసం గాలిస్తున్నారు. ఈ ఫిర్యాదులతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు సునీల్ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టి ఒంగోలులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications