సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు కూటమి అభ్యర్ధి ఫిక్స్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పై బీజేపీ పట్టు బిగిస్తోంది. భాగస్వామ్య పార్టీగా ఉంటూనే బలం పెంచుకోవటం పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏపీలో కూటమి అధికా రంలోకి వచ్చిన తరువాత ఒక రాజ్యసభ.. ఒక ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు మరో రాజ్యసభ స్థానం పైన కన్నేసింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజీనామా తో ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈ సీటు కోసం టీడీపీ - బీజేపీ నుంచి ఆశావాహులు రేసులో ఉన్నారు. కాగా, ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది దాదాపు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
మారుతున్న సమీకరణాలు
కూటమిలో ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ సీట్ల ఖరారులోనూ బీజేపీ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఒక సీటు దక్కించుకుంది. రాజ్యసభ స్థానాల విషయం లో బీజేపీ కొత్త లెక్కలు తెర మీదకు తెస్తోంది. ఏపీలో కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. తొలుత మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా.. చివరకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్ధనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేసారు. ఫలితంగా టీడీపీ రెండు.. బీజేపీ కి ఒక సీటు దక్కాయి. ఇప్పుడు విజయ సాయిరెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కనుంది. అయితే, ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనా తో ఉన్నారు. కానీ, సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది.

బీజేపీ కొత్త లెక్కలు
ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు, పవన్ కు స్పష్టం చేసి నట్లు సమాచారం. సామాజి క సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వస్తోంది. వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు. తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు. కొత్త అభ్యర్ధి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. సాయిరెడ్డి స్థానం రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి కేటాయించాలని తొలుత భావించారు. ఈ క్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అధి నాయకత్వం మరో పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వాయిస్ జాతీయ స్థాయి లో బలంగా వినిపించే జీవీఎల్ నరసింహారావు పేరు ఫైనల్ అవుతుందని ప్రచారం సాగుతోంది.
బీజేపీ అభ్యర్దిగా..!
జీవీఎల్ నరసింహారావు గతంలో యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్దిగా విశాఖ నుంచి పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. కాగా, టీడీపీ విశాఖ సీటు ఇవ్వటానికి నిరాకరించింది. ఫలితంగా అనకాపల్లి సీటు దక్కగా.. అక్కడ నుంచి సీఎం రమేశ్ పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు జీవీఎల్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీ అధి నాయకత్వం భావిస్తున్నట్లు ఢిల్లీ బీజేపీ ముఖ్య నేతల సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవి కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలతోనూ సంప్రదింపులు చేసారు. కాగా, ఈ సీటు బీజేపీకే వెళ్లుందని టీడీపీ నేతలు సైతం చెబుతున్నారు. ఇక.. జీవీఎల్ తో పాటుగా మరో ఇద్దరు నేతలు సైతం రాజ్యసభ కోసం పోటీ పడుతున్నారు. దీంతో.. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా.. ఈ సీటు బీజేపీకి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications