NEET అభ్యర్ధుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు- ఈ రూట్లలో.. !
వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష (NEET 2026) ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఎన్టీఏ దీన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రేపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ పరీక్షను నిర్వహించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. దీనికి తోడు విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వేశాఖ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
నీట్ కేంద్రాల్ని కవర్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని మూడు రూట్లలో దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం-పలాస మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విశాఖ నుంచి ఇవాళ ఉదయం 11 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మధ్యాహ్నం 3 గంటలకు పలాస చేరుకుంటుంది. అలాగే పలాస నుంచి ఇవాళ రాత్రి 7 గంటలకు బయలుదేరే మరో ప్రత్యేక రైలు అర్ధరాత్రి 12.30కు విశాఖ చేరుకుంటుంది. వీటితో పాటు విశాఖ నుంచి రేపు సాయంత్రం 7 గంటలకు బయలుదేరే మరో ప్రత్యేక రైలు రేపు అర్ధరాత్రి 12.15కు పలాస చేరుకుంటుంది.

అలాగే తిరుపతి-చర్లపల్లి మార్గంలోనూ రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. వీటిలో తిరుపతి నుంచి నిన్న రాత్రి 9 గంటలకు బయలుదేరిన రైలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అలాగే చర్లపల్లిలో రేపు రాత్రి 8.25కు బయలుదేరే ప్రత్యేక రైలు తిరుపతికి ఎల్లుండి మధ్యాహ్నం 1.15కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకు రేణగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, డోన్, కర్నూలు టౌన్, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడలో హాల్ట్ లు ఇచ్చారు.














Click it and Unblock the Notifications