తిరుపతికి కొత్తగా వందేభారత్, అయిదు గంటల్లోనే - రూట్, టైమింగ్స్..!!
తిరుమల వెళ్లే భక్తులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి కొత్తగా వందేభారత్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒక వందేభారత్ రైలు కొనసాగుతోంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు విజయవాడ నుంచి బెంగళూరు కు ఖరారు చేసిన వందేభారత్ తిరుపతి మీదుగా నడపాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇక అయిదు గంటల్లోనే తిరుపతికి చేరుకునే వెసులుబాటు కలగనుంది. ఈ రైలు ప్రారంభ ముహూర్తం అధికారులు ఖరారు చేసారు.
విజయవాడ - బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ కు గతంలోనే ఆమోదం లభించింది. కానీ, ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా రైల్వే అధికారులు ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 27 లేదా 30వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ రైలుకు ఇప్పటి కే నెంబర్ .. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ వందే భారత్ రైలు (20711) కేవలం కేవలం అయిదు గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోనుంది. విజయవాడ - బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రతిపాదనలు గత మే నెలలోనే సిద్ధం కాగా, ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకోవచ్చు. మొత్తం 8 బోగీలు, 7 AC చైర్కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్కార్ కలిగిన బెంగళూరు ట్రెయిన్ తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది.

కాగా, విజయవాడ - బెంగళూరు ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. విజయవాడలో తెల్లవారుజామున 5.15 గంటలకు బయలు దేరి తెనాలి, ఒంగోలు నెల్లూరు మీదుగా ఉదయం 9.45గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా చిత్తూరు, కాట్పాడి జంక్షన్, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు (SMVT)కి మధ్యాహ్నం 2.15గంటలకు చేరుతుంది.
అంటే తిరుపతి వెళ్లే యాత్రికులు కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి చేరుకోవచ్చు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి కృష్ణరాజపురం, కాట్పాడి, జంక్షన్, చిత్తూరు మీదుగా సాయంత్రం 6.55గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా రాత్రి 11.45గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే తిరుపతికి వెళ్లే ప్రయాణీకులతో పాటుగా బెంగళూరు వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications