పెళ్లయి 24గంటలు గడవకముందే..: రాజంపేటలో వధువు మిస్సింగ్..
కడప: వివాహమై 24గంటలు కూడా గడవలేదు, వధువు అదృశ్యమైంది. సాయంత్రం వేళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ కనిపించిన వధువు.. ఒక్కసారిగా అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కడప జిల్లా రాజంపేట మండలం అత్తిరాల సమీపంలోని వినాయక్నగర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. వినాయక్నగర్లో నివసించే రమణమ్మ.. కుమార్తె సునీతకు ఈ నెల 25న వివాహం జరిపించింది. కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్యతో సునీత పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం నవ దంపతులను అదే రోజు సాయంత్రం అత్తిరాలకు తీసుకొచ్చారు.

రాత్రి సమయంలో ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ కనిపించిన సునీత.. ఒక్కసారిగా అదృశ్యమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం సాయంత్రం మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
More From
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications