వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు, ఏపీ ప్రజలకు విద్యుత్ శుభవార్త: చంద్రబాబు

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండ‌గ సంద‌ర్భంగా తెలుగులోగిళ్లు పండగ వాతావరణంతో కళకళలాడాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండ‌గ సంద‌ర్భంగా తెలుగులోగిళ్లు పండగ వాతావరణంతో కళకళలాడాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ ప్రజలకు పండుగ శుభవార్త తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పైసా కూడా పెంచ‌బోమ‌ని తెలిపారు. విద్యుత్ కోతలకు చరమగీతం పాడి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

No power hikes in andhra pradesh: Chandrababu Naidu

విద్యుత్ మిగులుతో మూతపడ్డ పరిశ్రమలు తెరుచుకున్నాయని చెప్పారు. ఉత్పత్తులు పెరగడం ద్వారా రోడ్డున పడ్డ కుటుంబాలకు ఉపాధి దొరికిందన్నారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాన్ని ప్రజలకు అంకితమిస్తున్నట్లు చెప్పారు.

స్మార్ట్ గ్రిడ్‌తో ప్రపంచానికి ఏపీ మార్గదర్శకం కావాలన్నారు. ఫైబర్ నెట్‌తో ప్రతి ఇల్లు ఓ విజ్ఞాన కేంద్రమవుతుందన్నారు. మహిళలను గౌరవించడంతోనే సరిపెట్టకుండా వారికి సాధికారత కల్పించిన ఘనత తమదేనని చెప్పారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu announced on Thursday that there is no power hike charges in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X