వివాదానికి తెర!: ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించారు
అమరావతి: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని రహదారులపై ఉన్న పలు విగ్రహాలను ఇప్పటికే ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక మ్యూజియం సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.'ఏంటిది?:
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయాక రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారు. రాష్ట్రంలో ఎటువంటి విగ్రహాల అనుమతికి అవకాశం లేకపోయినా అధికార దర్పంతో కొందరు నాయకులు స్థానిక నాయకుల అండదండలతో ఎన్టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

అంతేగాక, ఈ విగ్రహం ఏర్పాటుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
ఈ విగ్రహం ఏర్పాటు కాస్త చినికి చినికి గాలివానలామారి టిడిపి కమాండ్ దృష్టికెళ్లడం, మెయిన్రోడ్డులో ఆర్అండ్బి, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం వల్ల విగ్రహాన్ని తొలగించివేశారు. ఎట్టకేలకు ఎన్టిఆర్ విగ్రహం తొలగించడంతో కృష్ణా పుష్కరాల సందర్భంగా వివాదం ఏర్పడుతుందేమోనన్న సమస్య సానుకూలంగా పరిష్కారమైంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications