20 కోట్లివ్వాలని టిడిపి ఎంపీకి బెదిరింపు కాల్స్, అరెస్ట్

దీనిపై ఎంపీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు నగరంలోని అల్వాల్ సమీపంలోని వెంకటాపురం భూదేవినగర్కు చెందిన ముప్పై అయిదేళ్ల దేవేందర్ను అదుపులోకి తీసుకున్నారు.
అతనిని విచారించగా ఎంపీను తాను బెదిరించినట్లు అంగీకరించాడు. నిందితుడిని రిమాండుకు తరలించారు. కాగా, ఎంపీ మల్లారెడ్డికి మావోయిస్టు పేరుతో ఫోన్ చేసిన ఆగంతుకుడు రూ 20 కోట్లను తమ పార్టీకి విరాళంగా ఇవ్వాలని, లేకపోతే మల్లారెడ్డి గ్రూప్ కాలేజీలను పేల్చివేస్తామని హెచ్చరించాడు.
ఈ బెదిరింపు కాల్స్ పదేపదే వస్తుండటంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎంపీగా గెలుపొందిన రోజు నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కాయిన్ బాక్స్లనే వినియోగించాడు. అతనికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications