యుద్ధం కోరుకోం కానీ, ఆర్మీని అనుమానిస్తారా, వీడియోలపై నో: వెంకయ్య ఆగ్రహం
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్కు చెందిన వీడియోలు విడుదల చేయాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్కు కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు. దాడి వీడియోలు విడుదల చేయాలనే డిమాండ్లు పట్టించుకోమన్నారు.
దురదృష్టవశాత్తు కొందరు రాజకీయ నాయకులు పాకిస్తాన్ వాళ్ల వలె మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాము ఎవరితోను యుద్ధాన్ని లేదా సంఘర్షణను కోరుకోవడం లేదన్నారు. కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం గట్టి సమాధానం చెబుతామన్నారు.
ఇటీవల మన జవాన్లు చెప్పిన సమాధానమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇతరులను పదేపదే విసిగించేందుకు కూడా కొంతమంది జనం ఉంటారని, వాళ్లను తాము నిశ్సబ్దంగా డీల్ చేస్తామని చెప్పారు. మన ఆర్మీ కూడా నిశ్సబ్దంగానే సర్జికల్ స్ర్టయిక్ దాడి చేసిందన్నారు.

సర్జికల్ స్ట్రయిక్ వీడియోలను విడుదల చేయాలన్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తీరును ప్రస్తావిస్తూ.. అలాంటివాళ్లు చేసే బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలకు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
దేశంలోని మరే ఇతర పౌరుడికి భారత సైన్యం నిబద్ధత మీద అనుమానాలు ఉండి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. మనం సైన్యం పైన అనుమానాలు అవసరం లేదన్నారు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తారా అని మండిపడ్డారు. సర్జికల్ స్ట్రయిక్స్ పైన ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు.
బాధ్యతా రహిత వ్యాఖ్యలు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. భారత సైన్యం నిబద్ధతను ఏ ఒక్క భారతీయుడు శంకిస్తాడని నేను భావించనన్నారు. భారత సైన్యం గొప్ప పని చేసిందన్నారు. యావత్ దేశం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచమంతా భారత సైన్యం దాడులను గుర్తించిందన్నారు. పాకిస్థాన్ మాత్రమే బుకాయిస్తోందని, ఏదో ఒకటి చెప్పాలిగా అన్నారు.
కనీసం తమ దేశ పౌరుల అంత్యక్రియలు చేసేందుకు కూడా పాకిస్థాన్ సిద్ధంగా లేదని, అదీ వారి సంస్కృతి అన్నారు. పాకిస్థాన్ తేలు కుట్టిన దొంగలా ఉందన్నారు. సర్జికల్ స్ట్రయిక్ దాడుల ద్వారా అవరోధాలు కలిగించాలని కొందరు చూస్తుంటారని, సైన్యం దాడులు చేసినట్లే మౌనంగా ఎదుర్కొంటామని, ఎవరైనా రెచ్చగొడితే జవాన్లలా ధీటైన జవాబు ఇస్తామన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications