సిఎం బేవకూఫ్, రజ్వీలాగా తరుముతాం: పాల్వాయి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓ బేవకూఫ్ అని, కాసిం రజ్విని తరిమినట్లు తరుముతామని రాజ్యసభసభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మనిషి రూపంలో ఉన్న దెయ్యమంటూ, సొమ్ముల కోసమే కుర్చీని పట్టుకుని వేలాడుతున్నాడంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పదవి కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న సీఎం కిరణ్కుమార్రెడ్డి శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా అడ్డగోలు గా ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజమెత్తారు. నిధులన్నీ చిత్తూరుకు తరలించుకుంటూ తెలంగాణకు మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. సీఎం అవినీతి లెక్క లు విభజన తర్వాతైనా తేలుస్తామని హెచ్చరించారు. కిరణ్, చంద్రబాబు, జగన్లు రాష్ట్రాన్ని దోచుకున్న కాడికి దోచుకున్నారని, ఇంకా తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కిరణ్ అక్రమాలపై ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి తాను కోర్టుకు వెళతానని మాజీమంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం ఎలాంటి అనుమతుల లేకుండానే రూ. 6వేల కోట్ల నాన్ప్లాన్ గ్రాంట్స్ను చిత్తూరు జిల్లాకు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ నెలలోనే టెండర్లను తెరవాల్సి ఉండటంతో సీఎం ఆ పనులు ఆమోదం పొందేవరకు ఉండి, మొబిలైజేషన్ అడ్వాన్సులు పొంది ఆ తర్వాత రాజీనామా చేయాలని చూస్తున్నాడన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications