స్వార్థంతోనే: పనబాక, కిరణ్ రెడ్డి పార్టీపై చర్చలు: పితాని
గుంటూరు/ హైదరాబాద్: సొంత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు కాంగ్రెసు పార్టీని వీడుతున్నారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు. శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడే వారికి సిద్ధాంతాలేవీ ఉండవన్నారు.
కాంగ్రెసును వీడేవారికి ప్రజాప్రయోజనాలకన్నా వ్యక్తిగత విజయమే ముఖ్యమని విమర్శించారు. విభజన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అని పనబాక అన్నారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ శనివారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
కొత్త పార్టీ విధివిధానాలపై కిరణ్ కుమార్ రెడ్డి అందరితో చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర సమైక్యత కోసం కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు పోరాడారని చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సమయంలోనే ఎన్నికలు జరుగనున్నాయని పితాని తెలిపారు.












Click it and Unblock the Notifications