పదవి కోసం టి గుర్తు రాలేదు, చలించా: కెసిఆర్పై పవన్
మహబూబ్ నగర్/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో బిజెపి-టిడిపి కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చురకలు వేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ గుర్తుకు రాలేదని కెసిఆర్ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. తనకు తెలంగాణ అంటే ఇష్టమని, తాను తెలంగాణ సాయుధ పోరాటం చదువుతూ పెరిగానన్నారు.
యువకుల బలిదానాలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం అందరం ప్రతినబూనుదామని చెప్పారు. ఓట్లు చీల్చకూడదనే తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నిధులు సాధించగలిగే నేత కావాలని చెప్పారు. ఎన్డీయేలో టిడిపి, జనసేనలు భాగస్వాములు అని చెప్పారు. కాంగ్రెసు వ్యతిరేక ఓటు చీల్చడం తనకు ఇష్టం లేదన్నారు.

తెలంగాణ ప్రకటన తర్వాత కుటుంబంతో కలిసి కెసిఆర్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారన్నారు. ఆ తర్వాత బలిదేవత అన్నారని ఎద్దేవా చేశారు. యువకుల బలిదానాలు తనను కదిలించాయని చెప్పారు. యువతకు అన్యాయం జరిగితే ప్రశ్నించేందుకే తాను పార్టీని పెట్టానని చెప్పారు.
ప్రజల తరఫున ప్రశ్నించే పార్టీ జనసేన అన్నారు. తాను సినిమాలు చేస్తూనే ప్రజలకు జరిగే అన్యాయంపై ప్రశ్నిస్తానని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వలేదని తాను తెలంగాణను ఎత్తుకోలేదన్నారు. తెరాస మేనిఫెస్టో చూస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నట్లు ఉందన్నారు. బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణను ఇక బంగారు తెలంగాణ చేద్దామన్నారు.
అనుమతి దొరక్క..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్కు ఎటిసి అనుమతి దొరకలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా షాద్ నగర్ చేరుకుని ప్రచారం ప్రారంభించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications