యాత్రికుల సేవలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్: ప్రయాణీకుల్ని కాపాడి, డ్రైవర్ మృతి
ఏలూరు: గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఉచిత బస్సు సర్వీసు నడుపుతున్న డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అంతకుముందే బస్సును సురక్షితంగా నిలిపి, ప్రయాణీకులను కాపాడాడు.
జిల్లా కొవ్వూరులో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొవ్వూరులో ఉచిత సర్వీసు నడుపుతున్న డ్రైవర్ హనుమంత రావుకు ఛాతి నొప్పి వచ్చింది. కొవ్వూరు ఈజీకే రోడ్డు నుంచి నందమూరు రోడ్డు వైపు వెళ్తుండగా ఛాతినొప్పి ఎక్కువైంది.

తనకు ఛాతి నొప్పి ఎక్కువ కావడంతో డ్రైవర్ వాహనంను పక్కకు నిలిపి వేసి దిగిపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా కార్యక్రమాలు
గోదావరి పుష్కరాల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు గోష్పాద వద్ద స్వచ్చంధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు మంచి నీరు అందిస్తున్నారు. తెలియని వారికి దారి చూపించడం, ట్రాఫిక్ చిక్కులు సరిదిద్దటం వంటివి చేస్తున్నారు.
-
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications