అవిశ్వాసంపై జగన్ సై, చంద్రబాబు వెనుకంజ: 7 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి ఏడు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి రాజుకుంటోంది.
మరోవైపు, ఏపీకి కేంద్రం ఇచ్చిన లెక్కలపై బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ లెక్కలు తేల్చేందుకు పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఆయన శనివారం మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టవచ్చు కదా అని నిలదీశారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. టీడీపీ మాత్రం వెనుకంజ వేసింది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు అవిశ్వాసంపై వెనక్కి వెళ్లే విషయమై పవన్ స్పందించాలని ఇప్పటికే వైసీపీ నిలదీస్తోంది. దీంతో ఆయన స్పందనపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications