వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రధాని కావాలి, బిజెపితోనే సాధ్యం: పురంధేశ్వరి

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేత పురంధేశ్వరి అన్నారు. బిజెపి చేపట్టిన ‘మోడీ ఫర్ పిఎం-సీమాంధ్ర అభివృద్ధి' యాత్ర గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకుంది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని అన్నారు.

ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే నరేంద్ర మోడీని ప్రధాని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. మోడీ మాత్రమే దేశంలో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పేదవారి సంక్షేమానికి పాటుపడగలరని పేర్కొన్నారు. కాగా, పురంధేశ్వరి సమక్షంలో పలువురు నాయకలు, కార్యకర్తలు బిజెపిలో చేరారు.

Purandheswari

స్థానికంగా జిల్లాలోని పార్టీ శ్రేణులతో ఈ సందర్భంగా బిజెపి సమావేశం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, సీనియర్ నాయకులు కృష్ణంరాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర రాజు ప్రసంగించారు.

నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రఘుమోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీధర్ రెడ్డి, తూర్పు గోదావరి మాజీ ఎమ్మెల్యే అయ్యాజి వేమలు పాల్గొన్నారు.

English summary
Bharatiya Janata Party leader Purandheswari on Thursday said that peoples are wanted to see Narendra Modi as Prime Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X