Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల సీఈవో పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల సంఘం నిర్ణయాల పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి పార్టీల నేతల సూచనల మేరకు అధికారులు పని చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద టీడీపీ అభ్యర్దన మేరకు సీఈవో తీసుకున్న నిర్ణయం పైన వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఇదే వ్యవహారం పైన వైసీపీ ముఖ్య నేత పేర్ని నాని ఎన్నికల ప్రధానాదికారి మీనా పైన కీలక వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారుతోంది.

ఇష్టానుసారం నిర్ణయాలు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. పోస్టల్‌ బ్యా­లెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్‌ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్‌) లేకపో­యినా ఫర్వాలేదని, స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీక­రిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ల­ను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

Perni Nani made serious comments against Election CEO Meena over postal ballot

నిర్ణయం సరికాదు
13 ఏ, 13 బి పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇస్తారని, దానికి గెజిటెడ్‌ ఆఫీసర్ సర్టిఫికెట్‌ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచచ్చిందని ప్రశ్నించారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మ­రోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.

ఉద్దేశపూర్వకంగానే
ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు.టీడీపీ ఎన్డీఏ­తో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తా­మని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+