ఎత్తుకొని కిరణ్ ముద్దు, వారికో నమస్కారం (పిక్చర్స్)
హైదరాబాద్: ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మ్యాచ్ ఆడుతుంటే చూసే అవకాశం ఉందని కానీ తమకు అప్పట్లో అది లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు.
అందరూ బడికి పోయేలా, ఆడపిల్లలను బడికి పంపించేలా ప్రతిజ్ఞ తీసుకుందామన్నారు. ముప్పయ్యేళ్ల క్రితం ఇంత టెక్నాలజీ లేదని అప్పుడు తమకు సెల్ఫోన్, టీవిల గురించి తెలియదన్నారు. ఇప్పుడు సచిన్ ఆడుతుంటే పిల్లలు ప్రత్యక్షంగా టీవిల్లో చూస్తున్నారని, తాము మాత్రం రేడియోల్లో కామెంట్రీ వినే వాళ్లమన్నారు.
ఇలాంటి టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ప్రపంచం ఓ కుగ్రామంలా తయారయిందని, విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ రోజు మీకున్న అవకాశాలు తమకు అప్పుడు లేవన్నారు.

కిరణ్
ఉన్నత శిఖరాలు చేరేందుకు రెండు మార్గాలు ఉంటాయని సరైన మార్గంలో వెళితే కష్టపడినా విజయం సాధిస్తామని, అందులో సంతోషం ఉంటుందన్నారు.

కిరణ్
గురువారం భారత ప్రథమ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన బాలల దినోత్సవం కార్యక్రమంలో కిరణ్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి.

కిరణ్
అమెరికాలో చేసే పనిని హైదరాబాదు నుండి చేస్తున్నామని, ప్రపంచంలోని యాభై శాతం విమానాలకు హైదరాబాదు నుండి సూచనలు ఇస్తున్నామని కిరణ్ చెప్పారు.

కిరణ్
మంగళయాన్కు చెందిన పలు విడి భాగాలను హైదరాబాదులోనే చేశామని చెప్పారు. టెక్నాలజీతో పాటు మనం దూసుకెళ్లాలని పిల్లలకు కిరణ్ సూచించారు.

కిరణ్
భారత్, చైనా విద్యార్థులు బాగా కష్టపడతారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో కితాబిచ్చారని, విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలే గాని కష్టపడి చదువొద్దని కిరణ్ సూచించారు.

కిరణ్
ప్రతి ఒక్కరు చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారని, చదువుతోనే ఆలోచన పరిణితి వస్తుందని సిఎం అన్నారు.

కిరణ్
విద్యార్థులు తాము ఏ రంగంలో రాణిస్తారో తమను తాము తెలుసుకోవాలని, విద్యార్థులు కష్టపడితే ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుందన్నారు.

కిరణ్
ఉన్నత శిఖరాలు చేరేందుకు రెండు మార్గాలు ఉంటాయని సరైన మార్గంలో వెళితే కష్టపడినా విజయం సాధిస్తామని, అందులో సంతోషం ఉంటుందన్నారు.

కిరణ్
అడ్డదారిలో వెళ్లి గెలిస్తే అది అసలైన విజయం కాదని కిరణ్ కుమార్ రెడ్డి. కష్టపడకుండా ఏదీ మన వద్దకు రాదని తెలుసుకోవాలన్నారు.

కిరణ్
అడ్డదారిలో వెళ్లి గెలిస్తే అది అసలైన విజయం కాదని కిరణ్ కుమార్ రెడ్డి. కష్టపడకుండా ఏదీ మన వద్దకు రాదని తెలుసుకోవాలన్నారు.

కిరణ్
ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మ్యాచ్ ఆడుతుంటే చూసే అవకాశం ఉందని కానీ తమకు అప్పట్లో అది లేదని ముఖ్యమంత్రి అన్నారు.

కిరణ్
ముప్పయ్యేళ్ల క్రితం ఇంత టెక్నాలజీ లేదని అప్పుడు తమకు సెల్ఫోన్, టీవిల గురించి తెలియని కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతి బాలల దినోత్సవం కార్యక్రమంలో అన్నారు.

కిరణ్
ఇప్పుడు సచిన్ ఆడుతుంటే పిల్లలు ప్రత్యక్షంగా టీవిల్లో చూస్తున్నారని, తాము మాత్రం రేడియోల్లో కామెంట్రీ వినే వాళ్లమని కిరణ్ చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications