తుక్కుగుడా ప్రమాదం: ఇలా మృత్యుఒడిలోకి (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. తాజాగా తుక్కుగూడ ఔటర్ రింగ్రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలోని గోండియా జిల్లా ఖిరోడ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ యోగేందర్ కుటుంబంతో పాటు మొత్తం 9 మంది గురువారం మధ్యాహ్నం కారులో తిరుపతి దైవదర్శనానికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో తుక్కుగూడ ఔటర్ రింగ్రోడ్డుపై విజయవాడ వెళ్ళే మార్గంలో ఎగ్జిట్ 14 వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విద్య యోగేందర్ కాట్రే (30), భరత్ బబ్లే (50), పవురాన్ బాయి పాట్లే (60), వచ్చలబాయి సురుగురే (55), ధీనుబాయి (60) అక్కడికక్కడే మృతిచెందగా, యోగేందర్ కాట్రే (38), సుఖ్దేవ్ (40), ప్రభాభాయి (38), మనోజ్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారమందుకున్న పహాడిషరీఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ప్రైవేట్ ఆస్పత్రికి, మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. డ్రైవర్ను వెనుక కూర్చోబెట్టి యజమాని యోగేందర్ కారు నడుపుతున్నాడని, నిద్రమత్తులో వేగంగా కారును నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని శంషాబాద్ ఏసీపీ జె.బద్రీశ్వర్ తెలిపారు.
రింగ్ రోడ్డు ప్రమాదం 1
రింగ్ రోడ్డుపై నిలిచి ఉన్న ఇసుక లారీని కారు ఇలా వెనక నుంచి ఢీకొట్టింది. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం 2
అవుటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు ఆలవాలంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద యెత్తున వచ్చారు.
రోడ్డు ప్రమాదం 3
అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వారి మృతదేహాలు ఇలా పడి ఉన్నాయి.
రోడ్డు ప్రమాదం 4
రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ప్రాణాలు విడిచిన ఓ అమ్మాయి ఇలా అచేతనంగా పడి ఉంది.